Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రిలీజ్కు ముందే లీకైన ‘ఉప్పెన’: తెలుగులోనే ఫస్ట్ టైమ్ అలా.. అందుకే వాళ్లంతా భయపడుతున్నారా?
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో పరిచయ సినిమా అంటే ఆరు పాటలు.. మూడు నాలుగు ఫైట్లను పెట్టి కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తుంటారు. అయితే, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో మార్పులు రావడంతో ఇంట్రడక్షన్ సినిమాలను సైతం ప్రయోగాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ క్లైమాక్స్ లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
సుకుమార్ శిష్యుడితో మెగా మేనల్లుడు
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'ఉప్పెన'. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతుంది.
పాటతో రికార్డులు.. అంచనాలు రెట్టింపు
మెగా ఫ్యామిలీకి చెందిన కుర్రాడే అయినా.. కొత్త దర్శకుడితో చేసిన ప్రయోగాత్మక లవ్ స్టోరీతో సాదాసీదాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఇందులోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీనివల్ల సినిమాకై ఒక్కసారి హైప్ వచ్చింది. అలాగే, ఆ మధ్య వచ్చిన టీజర్, ఇటీవల వదిలిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేశాయి.
మొత్తం ఎంత సేపు? ఆ సర్టిఫికెట్ జారీ
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఉప్పెన' అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఇందులో భాగంగానే సెన్సార్కు వెళ్లొచ్చింది. సుందరంగా తెరకెక్కిన ఈ ప్రేమ కావ్యానికి 'యూ/ఏ' సర్టిఫికేట్ జారీ చేసింది బోర్డు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే, ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 27 నిమిషాలు ఉండబోతుందని కూడా అందులో పేర్కొన్నారు.
ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్
పాటతో అంచనాలు పెరిగిపోవడం.. మెగా ఫ్యామిలీ కూడా మద్దతుగా ఉండడంతో 'ఉప్పెన' సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు వరకూ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ 19 కోట్ల వ్యాపారం జరిగింది. బ్రేక్ ఈవెన్ రూ. 20 కోట్లుగా ఉంది.
డేంజర్ పాయింట్ అంటూ సస్పెన్స్తో
విడుదలకు సిద్ధం కావడంతో కొద్ది రోజులుగా 'ఉప్పెన' సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాలో ఓ డేంజర్ పాయింట్ ఉందని, దాన్ని దర్శకుడు ఎంతో పరిణితితో డీల్ చేశాడని చెప్పారు. దీంతో ఆ పాయింట్ ఏంటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
రిలీజ్కు ముందే లీకైన ‘ఉప్పెన' క్లైమాక్స్
ఎన్నో అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'ఉప్పెన'. మత్య్సకార కుటుంబానికి చెందిన ఓ పేద యువకుడు.. పరువును ప్రాణంగా భావించే ఊరి పెద్ద కుమార్తెను ప్రేమించడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్లోనే మెయిన్ కథను చూపించారు. ఈ నేపథ్యంలో రిలీజ్కు ఒకరోజు ముందు క్లైమాక్స్ పార్ట్ లీకైంది.
తెలుగులోనే ఫస్ట్ టైమ్.. అందుకే భయం
'ఉప్పెన' క్లైమాక్స్ ఎంతో కొత్తగా ఉంటుందట. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. విలన్ అయిన విజయ్ సేతుపతి.. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో హీరోకు మగతనం లేకుండా చేస్తాడట. అయినప్పటికీ హీరోయిన్ ప్రేమకు మాత్రమే విలువనిచ్చి హీరోను పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. డేంజర్ పాయింట్గా చెప్పే ఈ సీన్ ఒళ్లు గగుర్పొడిచేదిగా చిత్రీకరించారని టాక్.