Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
నిర్మాతలను ఎన్టీఆర్ అలా గౌరవించేవారట.. నాటి సంఘటనను గుర్తు చేసుకున్న వైజయంతీ మూవీస్
స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు జాతిని గర్వించేలా చేసి, తెలుగు ప్రజలకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడే. అందుకే నిన్న ఆయన జయంతి వేడుకలు అంత ఘనంగా జరిగాయి. టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ జయంతిపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా సనీ ప్రముఖులంతా ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్పై ట్వీట్ల వర్షం కురిసింది.
Recommended Video
వేడుకలకు దూరంగా..
ప్రతీ ఏడాది ఎన్టీఆర్ జయంతి నాడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో.. తాను ఈ ఏడాది ఘాట్ను దర్శించుకోవడం లేదని తెలిపాడు. ఈ మేరకు తాతపై ఉన్న ప్రేమను ట్వీట్ రూపంలో ప్రకటించాడు.
సెలెబ్రిటీల ట్వీట్స్ వైరల్..
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ మొత్తం సోషల్ మీడియాలో స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి యువ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు, హీరోయిన్లు, సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్ను గుర్తు చేసుకున్నారు.
వైజయంతీ సంస్థ ట్వీట్..
ఎన్టీఆర్ చేతుల మీదుగా స్థాపించబడిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమా ఎదురులేని మనిషి చిత్రాన్ని తెరక్కించింది వైజయంతీ మూవీస్. ఆ సమయంలో అశ్వనీదత్ వయసు కేవలం 24. అయితే నాడు నిర్మాతలు ఏ విధంగా గౌరవించేవారో, ఎంతటి సముచిత స్థానాన్ని ఎన్టీఆర్ ఇచ్చేవారో వైజయంతీ సంస్థ చెప్పుకొచ్చింది.
లేచి నిలబడిన ఎన్టీఆర్..
ఒక రోజు అశ్వనీదత్ సెట్కు వస్తే.. కూర్చున్న ఎన్టీఆర్ నిలబడి మరీ ఆహ్వానం చెప్పారట. దత్తు గారి గుండె ఝల్లుమందట. ‘అన్నగారు నేను వస్తే మీరు లేచి నిల్చోవడం ఏంటి? 'అని సిగ్గుతో ముడుచుకుపోయారట అశ్వనీదత్. ‘ఈ సినిమాకి నిర్మాతవి అందరికీ పని కల్పించి అన్నం పెట్టేవాడివి.. నిన్ను నేనే గౌరవించకపోతే ఇతరులు ఏం పట్టించకుంటారు'అని ఎన్టీఆర్ తిరిగి ప్రశ్నించారట.
నేటి పరిస్థితి భిన్నం..
అయితే
నేడు
మాత్రం
పరిస్థితి
మాత్రం
భిన్నంగా
ఉంది.
నిర్మాత
అంటే
కేవలం
డబ్బులు
పెట్టే
వాడే
అని
అనుకుంటున్నారు.
నిర్మాత
పరిస్థితి
మరీ
దయనీయంగా
మారింది.
కొందరు
నిర్మాతలు
హీరో,
దర్శకుల
చేతిలో
కీలుబొమ్మల్లా
మారిపోయారు.
మళ్లీ
నిర్మాతలు
నాటి
వైభవాన్ని
చూడగలరో
లేదో.