Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2.0 చైనా రిలీజ్ ఆగిపోయిందా? అందుకే చేతులెత్తేశారా?
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం 2.0. ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు చేసి లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేక చతికిల పడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయడం ద్వారా నష్ఠాలను పూడ్చుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. చైనాలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'హెచ్వై మీడియా'కు ఇందుకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. చైనాలో ఈ చిత్రాన్ని 50 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేయబోతున్నట్లు ఆర్బాటంగా ప్రకటనలు చేశారు.
ఇప్పటికే చైనాలో 2.0 మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే జులై 12న రిలీజ్ డేట్ లాక్ చేశారు. అయితే ఇపుడు 'హెచ్వై మీడియా' సంస్థ 2.0 మూవీ విషయంలో చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది.
జులై 19న డిస్నీ సంస్థ రూపొందించిన యానిమేటెడ్ మూవీ 'లయన్ కింగ్' విడుదలవుతోంది. ఈ సమయంలో 2.0 విడుదల చేస్తే నష్టం తప్పదనే ఆలోచనతో రిలీజ్ విషయంలో చేతులు ఎత్తేసిందట. గతంలో ఈ సంస్థ ఇండియాకు చెందిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రాన్ని చైనాలో విడుదల చేసి భారీగా నష్టపోయింది. మరోసారి అలాంటి రిస్క్ చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా లేదని టాక్. త్వరలోనే 2.0 చైనా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
2.0 చిత్రాన్ని దాదాపు రూ. 545 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. బాహుబలిని మించిన విజయం సాధిస్తుందని అంచనా వేశారు. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం ఫెయిలైంది. దీంతో నిర్మాతలు నష్టోపోక తప్పలేదు.