Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
3 వేలమంది టెక్నీషియన్ల శ్రమ.. 500 కోట్ల బడ్జెట్.. 2.0 గురించి శంకర్!
కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ అంటే ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేది. బాహుబలి చిత్రంతో రాజమౌళి ఆ అభిప్రాయాన్ని చెరిపేశాడు. కళ్ళు చెదిరే విజువల్స్ తో బాహుబలి చిత్రంతో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. 2.0 చిత్రం పేరుకే భారతీయ చిత్రం కానీ హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండబోతోంది.
వినాయక చవితి కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు. టీజర్ కే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం. తాజాగా దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా 3 వేలమంది టెక్నీషియన్లు పనిచేసినట్లు శంకర్ తెలిపాడు.
కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏడాది సమయం వెచ్చించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ ఈ చిత్రం కోసం పనిచేశారు. విధంగా ఈ చిత్ర బడ్జెట్ లెక్క కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రం కోసం దాదాపు 500 కోట్ల(75 మిలియన్ డాలర్స్) ఖర్చు చేసినట్లు పోస్టర్ ద్వారా శంకర్ ప్రకటించాడు.
#2point0 is an effort unlimited of more than 3,000 technicians around the world. Teaser in 3 days! pic.twitter.com/om3AzL9G2j
— Shankar Shanmugham (@shankarshanmugh) September 10, 2018