మాయమాటలు చెప్పి పవర్స్టార్ ఉచ్చులో...

వారిని కూడా అరెస్టు చేసేందుకు జాబితా రూపొందిస్తున్నారు. వీరిలో ముఖ్యులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణు, చెన్నైకి చెందిన క్రిష్టోఫర్ అని గుర్తించారు. తాజాగా ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. నగదు మోసం కేసుల్లో అరెస్త్టెన పవర్స్టార్ ప్రస్తుతం వేలూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే.
తమను కూడా ఆయన మోసం చేశాడంటూ బాధితులు రోజూ నగర పోలీసు కమిషనర్ జార్జ్ను ఆశ్రయిస్తున్నారు. ఛండీగర్కు చెందిన జగదీష్సింగ్ ఇలా ఇచ్చిన ఫిర్యాదులో.. తనకు రూ.200 కోట్ల రుణం ఇప్పిస్తానని పవర్స్టార్ నమ్మించాడని ఆరోపించారు. ముందుగానే తన వద్ద రూ.రెండు కోట్లు కమీషన్ తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు.
తాను కూడా రూ.రెండు కోట్లకు మోసపోయానని కోవైకు చెందిన రాథోడ్, రూ.90 లక్షలకు మోసపోయానని బెసెంట్నగర్కు చెందిన జగన్నాథన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు... పవర్స్టార్ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











