Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సూర్య ఎస్3 (సింగం-3) పై హై కోర్ట్ లో కేసు, ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ
ఈ నెల 23 అవ్వాల్సిన సింగం 3 చిత్రంపై చెన్నై హై కోర్టులో కేసు వేసారు.
చెన్నై: తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ను, మార్కెట్ను సంపాందించుకున్న సూర్య హీరోగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 23 న భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి ప్రి రిలీజ్ బుకుంగ్ మొదలైంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ఇప్పడు ఓ సమస్య వచ్చి పడింది.
చెన్నైకు చెందిన దేవరాజన్ అనే వ్యక్తి చెన్నై హై కోర్టులో ఎస్ 3 చిత్రం నిర్మాతలపై ఓ పిటీషన్ ఫైల్ చేసారు. ఆన్ లైన్ టిక్కెట్ బుక్కింగ్ వెబ్ సైట్స్ వారు ఈ చిత్రానికి సంభందించి గవర్నమెంట్ నిర్దేశించిన ఎమౌంట్ కన్నా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టు..తమిళ నాడు గరవ్నమెంట్ ని, ఎస్ 3 నిర్మాతలను డిసెంబర్ 21 వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ టీజర్తో పాటు తెలుగు వెర్షన్ టీజర్కు కూడా అద్భుత స్పందన లభిస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర టీజర్ తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్కు ఎస్-3 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు దాదాపుగా టీజర్ ఒక కోటి వ్యూస్ పైగా సాధించింది.
మొదటి రెండు సినిమాల కన్నా ఈ ఎస్-3 మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. సూర్యను పవర్ ఫుల్ పోలీస్ గా చూపిస్తే స్క్రీన్ మీద ఆ ఎనర్జీనే వేరేలా ఉంటుంది. అనుష్క, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అసలైతే దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని కార్తి కాష్మోరాకు పోటీగా ఎందుకని అనుకున్నాడో ఏమో తన సినిమాను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు సూర్య.
ఎస్-3 మీద భారీ రేంజ్లోనే అంచనాలున్నాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఎస్-2 అందరిని ఆశ్చర్య పరిచే రేటుకి బిజినెస్ జరిగింది. మరి తారా స్థాయిలో అంచనాలను సినిమా ఏవిధంగా చేరుకుంటుందో తెలుసుకోవాలంటే డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే.