Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఏం చేసుకుంటావో చేసుకో! : కమిడయన్ బెదిరింపు, నిర్మాత కోర్టు కి
చెన్నై:
కేవలం
తమిళవారికే
కాక
డబ్బింగ్
చిత్రాల
ద్వారా
తెలుగు
వారికి
సైతం
పరిచయమైన
కమిడియన్
సంతానం.
ఆయన
ఇప్పుడు
కోర్టు
సమస్యల్లో
ఇరుక్కున్నారు.
రీసెంట్
గా...
దిల్లుక్కు
దుడ్డు
చిత్రంతో
హీరోగా
మారిన
సంతానంకు
చెన్నై
సివిల్
కోర్టు
నోటీసులు
జారీ
చేసింది.
ఈయనతో
పాటు
చిత్ర
దర్శకుడు
రామ్బాలాకు
కూడా
నోటీసులు
అందాయి.
వివరాల్లోకెళితే... సంతానంపై పేపర్ ప్లైట్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ముహమద్ మస్తాన్ సర్భూదిన్ చెన్నై 14వ సిటీ సివిల్కోర్టులో సంతానంపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ నోటీసులో ఆయన ఆవి పరక్క ఒరు కథ అనే పేరుతో తాను చిత్రం నిర్మించ తలపెట్టానని, దీనికి దర్శకుడిగా రామ్బాలాను ఎంపిక చేశానని పేర్కొన్నారు.
అంతేకాకుండా రామ్బాలాకు రూ. 11 లక్షల పారితోషికం మాట్లాడి మూడు లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు చెప్పారు. అలాగే చిత్రానికి హీరోహీరోయిన్లుగా నటుడు శివ,నటి నందితలను ఎంపిక చేసి వారికీ కొంత అడ్వాన్స్ చెల్లించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే షూటింగ్కు సిద్ధమైన తరుణంలో దర్శకుడు రామ్బాలా తనకు ఎలాంటి కారణం చెప్పకుండా రాలేదని తెలిపారు. నటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి రామ్బాలా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. తన కథతో ఆ చిత్రాన్ని తీశారనీ.. దీంతో తాను సంతానంకు ఫోన్ చేసి అడగ్గా చిత్రానికి రామ్బాలా దర్శకుడు కాదని చెప్పారన్నారు.
ఇటీవల దిల్లుక్కు దుడ్డు చిత్ర పబ్లిసిటీ పోస్టర్లలో దర్శకుడిగా రామ్బాలా పేరును వేశారని, ఈ విషయమై మళ్లీ సంతానంను అడగ్గా నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారని చెప్పారు.కాగా తాను తన చిత్రం కోసం రూ. 81 లక్షల వరకూ ఖర్చు చేశానని..దిల్లుక్కు దుడ్డు చిత్రం విడుదలైతే తాను చాలా నష్టపోతానని లేఖలో తెలిపారు.
అందువల్ల చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసును శుక్రవారం విచారించిన చెన్నై 14వ సిటీ సివిల్ న్యాయమూర్తి గణపతిస్వామి నటుడు సంతానం,దర్శకుడు రామ్బాలాలను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.