Don't Miss!
- Sports గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- News పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోడీ ప్రభుత్వం ప్రశంసలు!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
ఎఆర్ రెహమాన్ నిరాహార దీక్ష, క్రెడిట్ కొట్టేయాలని చూడద్దంటూ కమల్
ఏఆర్ రహమాన్ తాజాగా జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళులకు మద్దతు తెలిపారు.
చెన్నై: జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని తమిళనాడులో గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రజలంతా పెద్ద ఎత్తున మెరీనా బీచ్ వద్ద నిరసనలు చేపడుతున్నారు.
ఇప్పటికే కమల్హాసన్, రజనీకాంత్, విజయ్, విశాల్ తదితర ప్రముఖులు జల్లికట్టునిర్వహించాలని కోరుతున్నారు. చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ సైతం జల్లికట్టు కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువకులకు సెల్యూట్ అంటూ తన మద్దతు ప్రకటించాడు.
తాజాగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ తాజాగా జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళులకు మద్దతు తెలిపారు. జల్లికట్టు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం ఉపవాసం చేస్తున్నట్లు ఏఆర్ రహమాన్ వెల్లడించారు.
I'm fasting tomorrow to support the spirit of
— A.R.Rahman (@arrahman) January 19, 2017
Tamilnadu!
ఇదిలా ఉంటే...జల్లికట్టుకు మద్దతుగా యువత చేస్తున్న ఆందోళనలో పాల్గొని వారి క్రెడిట్ను తారలు పొందడం సముచితం కాదని నటుడు కమల్హాసన్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో యువకులు చేపడుతున్న ఆందోళనల్లో పలువురు నటీనటులు, దర్శకులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
దీనిపై కమల్ స్పందిస్తూ.. తొలిసారిగా గర్వపడే స్థాయిలో యువత ఘనకార్యంలో నిమగ్నమైందన్నారు. సాధారణంగా యువకులను రాజకీయ నేతలు రెచ్చగొడతారని, అయితే ఇప్పుడు ఆ రాజకీయనేతలే ఆశ్చర్యపోయేలా యువత రంగంలోకి దిగిందని పేర్కొన్నారు.
సినీ ప్రముఖులు వారి ఆందోళనలో పాల్గొని ఆ క్రెడిట్ను పొందడం సముచితం కాదన్నారు. ఇది కేవలం యువకులకు దక్కాల్సిన విజయమని, రేపటి రాజకీయ నాయకులు పలువురు అందులో ఉండొచ్చని, వారి పోరాటాన్ని అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని కమల్ స్పష్టం చేశారు.