Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గ్యాప్ తర్వాత ఎ.ఆర్ హమన్ గాన కచేరీ...డిటేల్స్
చెన్నై : ప్రముఖ సంగత దర్శకుడు ఎ ఆర్ రహమాన్ సంగీత కచేరి చేస్తున్నాడంటే ఆ క్రేజే వేరు. ఆయన అభిమానులు ఎక్కడెక్కడివాళ్లు ఎలర్టైపోతారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కచేరీలు చేయటం లేదు.
అయితే చాలా సంవత్సరాల తర్వాత ‘ఇసై పుయల్' (సంగీత తుపాను) ఏఆర్ రెహ్మాన్ తన అభిమానులు, ప్రేక్షకుల కోసం సంగీత కచేరీ నిర్వహించనున్నారు. నాయిస్ అండ్ గ్రైన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చెన్నైలో జనవరి 16, కోయంబత్తూరులో 23న ఏర్పాటు చేసింది.
ఇప్పటికే దీనికోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు రెహ్మాన్. ప్రస్తుతం ఈ కచేరీకి చెందిన టికెట్లను ‘బుక్మైషో.కామ్' ద్వారా విక్రయిస్తున్నారు. ఓ ప్రముఖ ఎఫ్ఎం రేడియో కార్యాలయంలో కూడా అమ్ముతున్నట్లు సమాచారం.
కార్యక్రమం ద్వారా వచ్చిన నగదులో కొంత చెన్నై వరద బాధితుల కోసం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్ నుంచి ఇలాంటి కార్యక్రమం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరనుంది. అభిమానులపై స్వరాల వర్షం కురిపించనున్నారు రహమాన్.