Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గ్యాప్ తర్వాత ఎ.ఆర్ హమన్ గాన కచేరీ...డిటేల్స్
చెన్నై : ప్రముఖ సంగత దర్శకుడు ఎ ఆర్ రహమాన్ సంగీత కచేరి చేస్తున్నాడంటే ఆ క్రేజే వేరు. ఆయన అభిమానులు ఎక్కడెక్కడివాళ్లు ఎలర్టైపోతారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కచేరీలు చేయటం లేదు.
అయితే చాలా సంవత్సరాల తర్వాత ‘ఇసై పుయల్' (సంగీత తుపాను) ఏఆర్ రెహ్మాన్ తన అభిమానులు, ప్రేక్షకుల కోసం సంగీత కచేరీ నిర్వహించనున్నారు. నాయిస్ అండ్ గ్రైన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చెన్నైలో జనవరి 16, కోయంబత్తూరులో 23న ఏర్పాటు చేసింది.
ఇప్పటికే దీనికోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు రెహ్మాన్. ప్రస్తుతం ఈ కచేరీకి చెందిన టికెట్లను ‘బుక్మైషో.కామ్' ద్వారా విక్రయిస్తున్నారు. ఓ ప్రముఖ ఎఫ్ఎం రేడియో కార్యాలయంలో కూడా అమ్ముతున్నట్లు సమాచారం.
కార్యక్రమం ద్వారా వచ్చిన నగదులో కొంత చెన్నై వరద బాధితుల కోసం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్ నుంచి ఇలాంటి కార్యక్రమం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరనుంది. అభిమానులపై స్వరాల వర్షం కురిపించనున్నారు రహమాన్.