Don't Miss!
- News ఇజ్రాయెల్, ఇరాన్లకు వెళ్లొద్దు: భారత పౌరులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ
- Lifestyle భార్య స్నేహా రెడ్డి గురించి రెండు మాటల్లో చెప్పేసిన అల్లు అర్జున్, ఎస్, ఆమె గురించి నాకు తెలుసు.!
- Technology 256GB స్టోరేజీ, ట్రిపుల్ కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు.. ఫీచర్లు, ధర వివరాలు,
- Sports LSG vs DC: మాకో గుడ్ న్యూస్..అతడు తిరిగొచ్చాడు - పంత్
- Automobiles వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు ఝలక్.. 1000 మోడిఫైడ్ బైక్ సైలెన్సర్లు ధ్వంసం
- Finance TCS: ఒక్కో షేరుకు రూ.28 డివిడెండ్ ప్రకటించిన టీసీఎస్
- Travel నేడు ఒంటిమిట్ట ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ...
హన్సిక కు మొదలెట్టేసారు
తమిళనాడులో హీరోయిన్స్ కు గుడులు కట్టడం అనే విచిత్ర సంప్రదాయం ఉంది.గతంలో ఖుష్బూ,నమిత వంటి నటీమణులకు గుడులు కట్టిన అభిమానులు ఇప్పుడు హన్సికకు సైతం గుడి కట్టడానికి సిద్దమవుతున్నారు.మధురై నుంచి వచ్చిన కొందరు ఆమె అభిమానలు ఆమెతో ఈ ప్రపోజల్ పెట్టారు.అయితే హన్సిక డైరక్ట్ గా కట్టవద్దని చెప్పకుండా తాను తన అభిమానుల మనస్సులు బాధపెట్టలేనని,వారు ప్రేమ తనకు బలాన్ని ఇస్తోందని,అయితే తన మీద వీరాభిమానంతో ఎక్కడ వారు తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుని వృధా చేస్తారనే భయం ఉందని అంది.అంతేకాక మనుష్యులను దేముళ్ళుగా ఆరాధించటం తనకు నచ్చదని అది తన ఫ్యాన్స్ గుర్తించుకోవాలని చెప్పుకొచ్చింది.ఆ డబ్బుని ఏ పేద పిల్లల చదువుకో, చిన్న కుటుంబాల ఎదుగులకో ఖర్చు పెడితే తాను బాగా సంతోషిస్తానని అంది.ఇక హన్సిక రీసెంట్ గా తెలుగులో నటించిన కందిరీగ చిత్రం మంచి విజయం సాధించింది.అలాగే ఆమె సిద్దార్ద సరనస దిల్ రాజు నిర్మాతగా చేస్తున్న ఓహ్ మై ప్రెండ్ చి్త్రం కూడా షూటింగ్ జరుగుతోంది.తమిళంలో విజయ్ సరసన వేలాయిధం చిత్రంలో చేస్తోంది.వేలాయుధం చిత్రం తెలుగులో గతంలో నాగార్జున చేసిన అజాద్ కు రీమేక్.