twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సారి 'గజిని' కాంబినేషన్

    By Staff
    |

    'గజిని' చిత్రంలో కలసి నటించిన సూర్య, నయనతార మరో సారి వెండి తెరపై కనువిందు చెయ్యనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తమిళంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. 'ఆదవన్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తు, నరసింహా, దశావతారం వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాలను అందించిన కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఇప్పుడీ చిత్రం తెలుగులో అనువాదమవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ ఎన్.ఆర్.క్రియేషన్స్ అధినేత చందన రమేష్ దక్కించుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని చందన రమేష్ చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X