Don't Miss!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఖరారు, హీరో ఎవరంటే...?
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతలకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని ఇపుడు తమిళంలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తమిళ రీమేక్ హక్కులను ఆరా సినిమా వారు దక్కించుకున్నారు. ఈ విషయమై నిర్మాత మహేష్ మాట్లాడుతూ ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
రెండున్నర కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మూవీ దాదాపు రూ. 11 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అర్జున్ రెడ్డి తర్వాత అ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న చిత్రంగా నిలిచింది.
అర్జున్ రెడ్డి సినిమా సైతం తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇపుడు 'ఆర్ఎక్స్ 100' సైతం రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం చర్చనీయాంశం అయింది.