Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఖరారు, హీరో ఎవరంటే...?
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతలకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని ఇపుడు తమిళంలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తమిళ రీమేక్ హక్కులను ఆరా సినిమా వారు దక్కించుకున్నారు. ఈ విషయమై నిర్మాత మహేష్ మాట్లాడుతూ ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
రెండున్నర కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మూవీ దాదాపు రూ. 11 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అర్జున్ రెడ్డి తర్వాత అ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న చిత్రంగా నిలిచింది.
అర్జున్ రెడ్డి సినిమా సైతం తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇపుడు 'ఆర్ఎక్స్ 100' సైతం రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం చర్చనీయాంశం అయింది.