నటుడు బాల మురళీ మోహన్ ఆత్మహత్య
హైదరాబాద్: తమిళ నటుడు బాల మురళీ మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాల మురళీ మోహన్ ఆత్మహత్యతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన వయసు 54 సంవత్సరాలు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాల మురళీ మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయటకు వెళ్లిన ఆయన భార్య సీతా రాణి ఇంటి తలుపు తట్టగా ఎంతకీ అతను తలుపు తీయలేదు. అనుమానం వచ్చి కిటికీ తెరిచి చూడగా బాల ముకళీ మోహన్ ఉరి వేసుకుని కనిపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆయన కొడుకు ఉమాశంకర్ అమెరికాలో ఉంటున్నారు.
బాల మురళీ మోహన్ చనిపోయే ముందు ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని తెలుస్తోంది. బాల మురళీ మోహన్ నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ అనువాదం అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే.



Click it and Unblock the Notifications











