Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరో ధనుష్ తండ్రికి అరెస్టు వారెంట్
చెన్నై : తమిళ స్టార్ హీరో ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజాకు చెక్బౌన్స్ కేసులో మేజిస్ట్రేటు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. స్థానిక సాహుకారుపేటకు చెందిన సినిమా ఫైనాన్షియర్ ముకున్చంద్ వద్ద నుంచి కస్తూరిరాజా 2012లో రూ.65 లక్షలు అప్పు తీసుకున్నారు. దీనికి సంబంధించి కస్తూరిరాజా రెండు చెక్కులను ఇచ్చారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అయితే
చెక్కును
డిపాజిట్
చేయగా..
బ్యాంకులో
నగదు
లేకపోవడంతో
బౌన్స్
అయ్యింది.
ఈ
నేపథ్యంలో
కస్తూరిరాజాపై
జార్జ్టౌన్
మేజిస్ట్రేటు
కోర్టులో
ముకున్చంద్
చెక్బౌన్స్
మోసం
పిటిషన్ను
దాఖలు
చేశారు.
ఇది
న్యాయమూర్తి
కోదండరాజ్
ఎదుట
విచారణకు
వచ్చింది.
కస్తూరిరాజా
తరఫున
ఎవరూ
హాజరు
కాకపోవడంతో..
బెయిల్
అవకాశమున్న
అరెస్టు
వారెంట్ను
జారీచేశారు.
అనంతరం
ఈ
కేసును
రానున్న
13వ
తేదీకి
వాయిదా
వేశారు.
పూర్తి
వివరాల్లోకి
వెళితే...
ఈ కేసు చాలా కాలం నుంచి అంటే 2012 నవంబర్ నుంచీ నలుగుతోంది. అప్పట్లో కస్తూరిరాజా తన నుంచి రూ.65 లక్షలు అప్పు తీసుకున్నారని సినీ ఫైనాన్షియర్ బోత్రా పేర్కొన్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చారని, అయితే బ్యాంకులో నగదు లేకపోవడంతో బౌన్స్ అయిందన్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ వద్ద ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.
కస్తూరి రాజాపై మోసం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్పై న్యాయమూర్తి ఆర్ముగస్వామి సమక్షంలో విచారణ జరిగింది. నగర పోలీసు కమిషనర్ రెండు వారాల్లో రిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇక గతంలోనూ కస్తూరి రాజా తెలుగు నిర్మాత నట్టికుమార్ తో వివాదమై కేసులో ఇరుక్కున్నారు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా '3' చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం తెలుగు హక్కులను పొందిన నట్టి కుమార్ నుంచి రాజా అనేక వివాదాలను, అభియోగాలను ఎదుర్కొన్నారు.
అలాగే ఈ చిత్రం రైట్స్ కొనుగోలు చేయటం వల్ల తానెంతో నష్టపోయానని, రాజా అందుకు పరిహారంచెల్లించాలని కోరారురు నిర్మాత నట్టి కుమార్. వీటిని తిప్పికొడుతూ, ఒప్పందం ప్రకారం ఆ చిత్రం రైట్స్ను తాను అమ్మానని, నట్టికుమార్ తనపై వెూపే అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టికుమార్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, దాంతో తానెంతో నష్టపోయానని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టి నిరాధారమైన అభియోగాలను చూసి పోలీసులు కూడా నవ్వుకుంటున్నారు.
నన్ను, నా కొడుకు ధనుష్ను, కోడల్ని వివాదాల్లోకి లాగితే, అతనిపై నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేయడం తప్ప, వేరే గత్యంతరం లేదన్నారు కస్తూరి రాజా. రాజా మాటలను ఖండిస్తూ, రాజాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తగ్గ అన్ని ఆధారాలు తనవద్ద వున్నాయని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని బహిర్గతపరుస్తానని, అతడన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, నట్టి కుమార్ సమాధానం ఇచ్చారు. మళ్లీ ఈ సారి కోర్టు కేసులో కస్తూరి రాజా ఇరుక్కోవటంతో హాట్ టాపిక్ గా మారింది.