హాస్పటల్ పాలైన కమల్ హాసన్..డిటేల్స్
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ స్వల్ప అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. సినిమా చిత్రీకరణ సమయంలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురైన కమల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రేపు డిశ్చార్జి అయి యథావిధిగా చిత్రీకరణలో పాల్గొంటారని కమల్ సన్నిహితులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో హాస్పటిల్ లో చికిత్స పొందుతున్నారు. 59 సంవత్సరాల కమల్ ఆరోగ్య పరిస్ధితి కుదుటపడిందని, ఆయన్ను మంగళ లేదా బుధ వారాల్లో డిశ్చార్జి చేస్తామని హాస్పటిల్ వైద్యులు చెప్తున్నారు. మొదట కమల్ ..నరాలకు చెందిన సమస్యలతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే హాస్పటిల్ వర్గాలు దానిని ఖండిచాయి. అసలేం జరిగిందనే విషయం మాత్రం వెల్లడించలేదు.

ఇక కమల్ తాజా చిత్రం 'పాపనాశం' విషయానికి వస్తే.... ఇందులో కమల్ భార్యగా గౌతమి నటిస్తున్నారు. మోహన్లాల్, మీనా జంటగా నటించిన 'దృశ్యం' చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ఈ సినిమా పునర్నిర్మితమై ప్రేక్షకులను అలరించింది. అదే కథతో ఇప్పుడు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కమల్ 'పాపనాశం'గా సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర వాల్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి.
కమల్ మళ్లీ 1980 దశకంలో ఉన్నట్లు ఇందులో కనిపిస్తున్నారు. ఓ గ్రామీణ వ్యక్తిలా.. సినీ జనాలను ఆకట్టుకుంటున్నారు. 'మైఖెల్ మదన కామరాజ్' శైలిలో కమల్ కనిపిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి కథాపరంగా 'పాపనాశం' ఎంత ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే అంటున్నారు. బిజినెస్ వర్గాల్లో సైతం ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అన్ని చోట్లా ప్రూవైన కథ కావటంతో సినిమా ఘన విజయం సాధించటం ఖాయమంటున్నారు.


Click it and Unblock the Notifications











