Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నీ అభిమానిగా సిగ్గు పడుతున్నాం...! అమ్మ మరణం పై కమల్ హసన్ స్పందనకు అభిమానుల ప్రతిస్పందన
జయలలిత మృతికి అభిమానులు, తమిళ ప్రజలు అశ్రునయనాలతో సంతాపం తెలియజేస్తున్న సమయంలో నటుడు కమల్హాసన్ ఓ వివాదాస్పద ట్వీట్ పెట్టి కలకలం సృష్టించాడు.
కమల్కు, జయలలితకు మధ్య విభేదాలున్నాయని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఉద్దేశించి 'పంచె కట్టుకున్న తమిళుడు ఈ దేశానికి ప్రధాని కావాలి' అని కమల్ అన్నాడు. దీంతో చీర కట్టుకున్న జయలలితకు కోపం వచ్చి కమల్ 'విశ్వరూపం' సినిమాకు అడ్డంకులు సృష్టించిందని తమిళనాడులో చెప్పుకుంటారు.
అయితే కమల్ అప్పుడు అలా అలా అనటానికి ఒక కారణం ఉంది. ఆయన తీసిన "విశ్వరూపం" సినిమాకి అడ్డంకులు కల్పించింది అన్న కారణం తో అలా స్పందించాడు కమల్. అయితే ఇప్పుడు ఆమె మరణం తర్వాత కూదా కమల్ స్పందన దారుణం గాఉంది. అసలింతకీ అప్పుడేం జరిగిందీ..?? ఇప్పుడు కమల్ పెట్టిన ట్వీట్ ఏమిటీ అంటే...
అప్పట్లో కమల్ హసన్ "విశ్వరూపం" అనే సినిమా తీసారు, అయితే అందులో పలువివాదాస్పద అంశాలున్నాయనే కారణం తో ఆ సినిమాని కొన్నాళ్ళు విడుదల కాకుండా ఆపేసారు జయలలిత, అప్పటినుంచీ కమల్ కి జయలలిత అంటే పడదు. ఎప్పుడూ ఆమెని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి తానే ఇబ్బందుల్లో పడ్డాడు.
అయితే దాన్నే మనసులో పెట్టుకున్న కమల్ హసన్ ఇప్పుడు. మరీ ధారునం గా ప్రవర్థించి మళ్ళీ చిక్కులు కొనితెచ్చుకున్నాడు. పురచ్చి తలైవి, సీఎం జయలలిత మరణ వార్త తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచింది. ఆమె మృతికి అభిమానులు, తమిళ ప్రజలు అశ్రునయనాలతో సంతాపం తెలియజేస్తున్న సమయంలో నటుడు కమల్హాసన్ ఓ వివాదాస్పద ట్వీట్ పెట్టి కలకలం సృష్టించాడు.
'జయలలిత మీద ఆధారపడి బతుకుతున్న వారందరికీ నా ప్రగాఢ సానుభూతి' అని జయ మృతికి నివాళిగా కమల్ ట్వీట్ చేశాడు. దీంతో అగ్గి రాజుకుంది. ఇది జయలలిత అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా మండించింది. ఇంకా, అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే కమల్ ఇలా ఎద్దేవా చేయడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అందుకే ట్విట్టర్ ద్వారానే కమల్ను దుయ్యబడుతున్నారు. 'నీకు అభిమానిని అయినందుకు సిగ్గుపడుతున్నానం'టూ ఓ అభిమాని రీ-ట్వీట్ చేశాడు. అంతే కాదు ఇక వరుస ట్వేఏత్ లతో కమల్ హసన్ పై దాడి మొదలయ్యింది. తన ఒక్క సినిమాకి సమస్య వచ్చిందన్న అక్కసుతో కనీస మానవత్వాన్ని కూడా మరిచిన "ఈ విశ్వ నటుడు" తన చిన్న మనసుని మరో సారి బయట పెట్టుకున్నాడు.