స్నేహ భర్తకు షాకిచ్చిన విద్యుత్ బోర్డ్... కరెంట్ బిల్లు చూసి అవాక్కయ్యాడట
కరోనా మూలంగా గత రెండు నెలలుగా లాక్ డౌన్ను పాటిస్తూనే ఉన్నాము. ఇప్పటికీ ఇంకా అదే పద్దతిని కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడు మెల్లి మెల్లిగా జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. కరోనాకు భయపడకుండా, దాంతో కలిసి జాగ్రత్తగా జీవించడాన్ని ప్రజలు అలవర్చుకుంటున్నారు. అయితే రెండు నెలలుగా స్థంభించిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విద్యుత్ బోర్డ్.. తన కార్యకలాపాలను ప్రారంభించేసింది.

రెండు నెలలుగా..
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా రెండు మూడు నెలలుగా కరెంట్ బిల్లులు కట్టడం లేదు. అయితే కొందరు మాత్రం ఆన్లైన్లోనే అంతకు ముందు వచ్చిన బిల్లు ఆధారంగా కట్టేస్తున్నారు. అయితే ఎక్కువమంది ప్రజలు మాత్రం కట్టడం లేదు.

తప్పుల తడక..
విద్యుత్ బిల్లులు తప్పుల తడకగా మారింది. ఆ మధ్య ఏపీలో కొందరికీ బిల్లు చూసి షాక్ కొట్టినట్టైంది. పూరి గుడిసెల్లో ఉన్నవారికి సైతం వేలల్లో బిల్లు వచ్చింది. అయితే వీటిపై అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా హీరోయిన్ స్నేహ భర్తకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

70వేల బిల్లు..
స్నేహ భర్త, నటుడు ప్రసన్న ఇంటికి డెబ్బై వేల కరెంట్ బిల్లు వచ్చిందని, విద్యుత్ సంస్థ దోపీడీ చేస్తోందని మండిపడ్డారు. తనకు రెండు కనెక్షన్స్ ఉన్నాయని, అయినా ఇంత మొత్తంలో బిల్లు రాదని ఆయన చెప్పుకొచ్చాడు. వీటిపై సదరు అధికారులు కూడా స్పందింంచారు.
Recommended Video

నేనైతే కట్టగలను..
తన ఇంటికి రూ .70 వేల బిల్లు వచ్చిందని చెబుతూ.. ఈ లాక్డౌన్ సమయంలో ఈ-బోర్డు దోపిడీకి పాల్పడిందని ఎంత మంది గ్రహించారు? 'అని ఓ ట్వీట్ చేశాడు. తాను సాధారణంగా రీడింగులను తీసుకున్న 10 రోజుల్లోపు చెల్లించడం అలవాటు చేసుకున్నానని, మార్చిలో రీడింగులను తీసుకోకపోవడం వల్ల బిల్లు చెల్లించలేదన్నారు. నిందలు వేయడం లేదా నిందించడం తన ఉద్దేశ్యం కాదని ఎంత మంది ఎక్కువ ఫీజు చెల్లించారని తెలుసుకోవడమే కోసమే చేశానని అన్నారు.


Click it and Unblock the Notifications











