Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Vivek no more: సమాజానికి ఎనలేని సేవ.. తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ప్రధాని మోదీ..
ప్రముఖ కమెడియన్ వివేక్ ఇకలేరనే వార్త అభిమానులను, సినీ తారలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. శుక్రవారం రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు గురికావడంతో వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మరణించారు. ఈ వార్తతో కోలీవుడ్ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయింది. వివేక్ మృతిపై పలువురు సినీ, రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
కమెడియన్ వివేక్కు శ్రద్దాంజలి ఘటించిన సినీ తారలు.. కంటతడి పెట్టిన కీర్తి సురేష్
నటుడు వివేక్ మరణ వార్తతో విషాదంలో మునిగిపోయాను. ఆయన కామిక్ టైమింగ్, ఇంటెలిజెన్స్ డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులు అద్బుతమైన వినోదాన్ని పంచారు. తన చిత్రాల ద్వారా, తన జీవితంలో సమాజానికి, పర్యావరణానికి ఎనలేని సేవ చేశారు. వివేక్ అభిమానులకు, స్నేహితులకు, కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓశాంతి అంటూ నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
చెన్నైలోని తన నివాసం వద్ద వివేక్ పార్తీవ దేహాన్ని అభిమానులు, సన్నిహితుల సందర్శనార్థం ఉంచారు. శరత్ కుమార్, అర్జున్, కీర్తీ సురేష్, సూర్య, కార్తీ తదితరులు ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. నటుడు సిద్దార్థ్, కీర్తి సురేష్, త్రిష, కంటతడి పెట్టి భోరుమన్నారు.