ప్రముఖ హీరోయిన్స్ అసిన్, నయనతార, మీరాజాస్మిన్ లకు తమిళనాడు ప్రభుత్వం మంగళవారం కలైమామణి అవార్డులను ప్రకటించింది. పాతతరం హీరోయిన్ బి.సరోజాదేవి, ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ లతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న డభ్భై మందికి ఈ అవార్డులను అందచేయనున్నారు. భరతనాట్యంలో..సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు అవార్డు లభించింది. అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయలు నగదును కూడా అందిస్తారు.