Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జెనీలియా పై బ్యాన్ పెట్టడం తప్పేటట్లు లేదు...
జెనీలియాపై అధికారికంగా బ్యాన్ పెట్టే ఉద్దేశంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, నడిగర సంఘం మరియ ఫెఫ్సీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కారణం ఆమె శ్రీలంక కొలంబోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఫిఫా)కి అటెండుకావటమేనని తెలుస్తోంది. అక్కడ వేల కొలది తమిళలు చంపబడ్డారని అక్కడికి వెళ్ళవద్దని ఈ సంఘాలు అందరు ఆర్టిస్టులుకు లెటర్స్ పంపించి, బహిరంగ ప్రకటన చేసాయి. దాంతో రజని, కమల్, అమితాబ్, షారూఖ్, అభిషేక్, ఐశ్వర్య రాయ్, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రత్యేక ఆహ్వానితులు సైతం ఈ పంక్షన్ ని బోయ్ కాట్ చేసాయి.
ఇక ఈ సంఘటనకు వెంటనే తమిళ ఆర్టిస్టుల సంఘం స్పందించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటించింది. ఫెప్సీ ప్రెసిడెంట్ విసి గంగనాధన్ ఈ ఇష్యూ పై మాట్లాడుతూ..మా మాట మన్నించి అమితాబ్ వంటి స్టార్స్ సైతం మద్దుతునిచ్చి ఆ పంక్షన్ కి అటెండుకాలేదు. వారికి మా కృతజ్ఞతలు. అలాగే కమల్, రజనీ వంటి మెగా స్టార్స్ సైతం మా సెంటిమెంట్స్ ని మన్నించారు. కానీ కొంతమంది మాత్రం ఆ స్మసానానికి(కొలంబో)కి వెళ్ళి ఆ ఫంక్షన్ కి అటెండయ్యారు. వారిపై బ్యాన్ పెడతాము. వారికి మేము ఏ విధమైన సహాయసహకారాలు అందించము. మిగతా యూనియన్స్ ని కూడా అదే కోరుతున్నాము అని ఆయన చెప్పారు.