Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాస్పిటల్ కోసం జ్యోతిక 25 లక్షల విరాళం.. దూషించిన వారే ప్రశంసలతో..
తమిళ సూపర్ స్టార్ సూర్య ఫ్యామిలీ విరాళాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు. పేదల కోసం, సమస్యల్లో ఉన్న వారిని ఆదుకోవడం, సామాజిక సమస్యలపై స్పందించిన దాఖలాలు ఉన్నాయి. తాజా సూర్య సతీమణి, నటి జ్యోతిక తంజావూర్ ప్రభుత్వ హస్పిటల్ కోసం 25 లక్షల రూపాయలను విరాళం ప్రకటించారు. సూర్య నిర్వహించే అగరామ్ ఫౌండేషన్ తరఫున విరాళాన్ని అందజేశారు.
హాస్పిటల్ అభివృద్ది పనులకు వినియోగించాలని అధికారులను కోరారు. హాస్పిటల్కు అవసరమైన సాంకేతిక పరికరాలు, బెడ్స్ను అధికారులు సమకూర్చడంతోపాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పెయింటింగ్ పనులును పూర్తిచేశారు. పిల్లల కోసం పార్క్ను అందంగా తీర్చిదిద్దారు. హస్పిటల్ అభివృద్ది కోసం జ్యోతిక విరాళం ప్రకటించిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం, హాస్పిటల్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం తంజావూరు వెళ్లిన జ్యోతిక ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆ ఆలయంలో పరిశుభ్రత గురించి కొనియాడారు. అక్కడే ఉన్న హాస్పిటల్లో వసతులు చూసి ఆమె.. ఇలాంటి ఉండే ఆరోగ్యం ఎలా బాగుపడుతుందని వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఆ హాస్పిటల్ బాగు కోసం 25 లక్షల విరాళం ప్రకటించడం విశేషంగా మారింది. జ్యోతిక విరాళం విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.