Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
హీరోయిన్ రంభ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది
తన గ్లామర్, బబ్లీ యాటిట్యూడ్తో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల ప్రేక్షకులను ఊర్రూతలూగించిన హీరోయిన్ రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. తన భర్తతో కెనడాలో సెటిలైన ఆమె పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సినిమాల వైపు రావడానికి ప్రయత్నించారు.
అయితే రంభ కాపురంలో కొన్ని ఆటు పోట్ల కారణంగా ఆమె రీ ఎంట్రీ ప్రయత్నాలు ఫలించలేదు. కొంత కాలం ఆమె తమిళ టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. అందులో కూడా ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదనే చెప్పాలి.
రెండేళ్ల క్రితం రంభ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, తెలుగు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభింస్తున్నారనే ప్రచారం సైతం సాగింది. అయితే అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. తాజాగా మరోసారి రంభ రీ ఎంట్రీ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
సరైన కథలు దొరకక పోవడం వల్లనే రంభ రీ ఎంట్రీ ఆలస్యం అవుతోందని, తాజాగా ఆమెకు పర్ఫెక్టుగా సూటయ్య కథ దొరికిందని, త్వరలో తమిళ సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత రంభ మళ్లీ తెరపైకి వస్తుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మరి ఆమె ఎలాంటి పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.