Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
దర్శకురాలిగా మారబోతున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. ఇక మెగాఫోన్తో హంగామా!
దక్షిణాదిలో ప్రతిభ చాటుకొంటున్న యువ హీరోయిన్లలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. విభిన్నమైన పాత్రలతో అద్భుతంగా వెండితెర మీద రాణిస్తున్నారు. తమిళం, తెలుగు చిత్రాలనే తేడా లేకుండా ఫెర్ఫార్మెన్స్తో కూడిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
విశాల్తో కలిసి పందెంకోడి, విజయ్తో కలిసి సర్కార్ చిత్రంలో విలన్ పాత్రలతో ఆకట్టుకొన్నారు. ఇక ఇటీవల రిలీజైన క్రాక్ సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పించారు. తాజాగా విడుదలైన నాంది చిత్రంలో లాయర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇలా నటిగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా మారేందుకు సంచలన నిర్ణయం తీసుకొన్నారు.
తమిళంలో తెరకెక్కే ఓ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా మారి మెగాఫోన్తో హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకత్వం వహించే చిత్రంలో నటీనటుల ఎంపిక జరుగుతుందని, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే వెల్లడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.