Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమ్మ కష్టంలో ఉన్నపుడు ఎవరూ రాలేదు: విజయశాంతి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకోవడానికి ఇటీవల విజయశాంతి చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమె మీడియాతో మాట్లాడుతూ జయలలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్: ఒకప్పుడు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా, తర్వాత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి....2014 ఎన్నికల తర్వాత వార్తల్లో కనిపించడమే లేదు. చాలా కాలం తర్వాత విజయశాంతి మీడియా కంట పడ్డారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకోవడానికి ఇటీవల విజయశాంతి చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమె మీడియాతో మాట్లాడుతూ జయలలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో జయలలిత మరణంపై నటి గౌతమి చేసిన ఆరోపణలపై మీడియా వారు ఆమెను కదిలించగా....ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవరు కూడా అమ్మ కష్టంలో ఉన్నప్పుడు రాలేదు, కష్టంలో ఉన్నప్పుడు నిలిచినవాళ్లే నిజమైన ఆప్తులు అంటాం. నాకు తెలిసి వీళ్లు ఎవరూ ఆమె కోసం రాలేదు . జైలుకి వెళ్లినప్పుడు, బాధలో ఉన్నప్పుడు రాలేదు. అలాంటి వారు ఇపుడు కొత్తగా మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
హాస్పటల్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి సెక్యూరిటీ కూడా భారీగా ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా కుట్ర జరిగిందని అనడం సరికాదు అన్నారు.