Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తొమ్మిదేళ్ల తర్వాత వెండితెరపై శ్రేయారెడ్డి.. జాతీయ అవార్డు కన్ఫర్మట..
తమిళ టెలివిజన్ సూపర్ స్టార్గా వెలుగొందిన నటి శ్రేయారెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె వివాహం చేసుకొని యాంకరింగ్కు, నటనకు తాత్కాలికంగా దూరమై
తమిళ టెలివిజన్ సూపర్ స్టార్గా వెలుగొందిన నటి శ్రేయారెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె వివాహం చేసుకొని యాంకరింగ్కు, నటనకు తాత్కాలికంగా దూరమైంది. తాజాగా అండవ కానోమ్ చిత్రంలో నటించింది. విడుదలకు ముందే ఈ చిత్రం సెన్సేషనల్గా మారింది. ఈ చిత్రానికి అవార్డులతోపాటు కలెక్షన్ల రివార్డులు కూడా వచ్చే అవకాశముందనే మాట వినిపిస్తున్నది.
తొమ్మిదేళ్ల తర్వాత అండవ కానోమ్లో శ్రేయారెడ్డి
ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. నటి శ్రేయారెడ్డి మాట్లాడుతూ సుమారు తొమ్మిదేళ్ల తర్వా తాను నటించిన చిత్రం అండవ కానోమ్ అన్నారు. దర్శకుడు ఇది మీ కెరీర్లో చాలా మంచి చిత్రంగా నిలిచిపోతుందన్నారన్నారు.
జాతీయ అవార్డుల రేసులో
ఈ సినిమాపై నిర్మాతల్లో ఒకరైన జే సతీష్కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జాతీయ అవార్డుల రేసులో అండవ కానోమ్ దుమ్ము రేపడం ఖాయం అని అన్నారు. లియోవిజన్ సంస్థ రాజ్కుమార్, జేఎస్కే.ఫిలిం కార్పొరేషన్ సతీష్కుమార్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అండవ కానోమ్. వేల్మది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి శ్రేయారెడ్డి ప్రధాన పాత్రను పోషించారు. విజయ్సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వమిత్ర సంగీతాన్ని అందించారు.
అద్భుతంగా వివరించారు..
షూటింగ్ స్పాట్లో పక్కన కూర్చుని మదురై ప్రజల జీవన విధానాన్ని నిర్మాత చాలా అద్భుతంగా వివరించారు. జేఎస్కే లేకుంటే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు అని శ్రేయారెడ్డి అన్నారు. దర్శకుడు వేల్మది తన వద్ద ఓ గ్రామీణ కథ ఉంది, 300 మందిని నటింపజేసి చిత్రాన్ని తెరకెక్కిస్తాను అని తనకు చెప్పారని జే సతీష్కుమార్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఈ కథ చెప్పగానే ఇందులో నటించమని మొదట అడిగింది నటి శ్రేయారెడ్డినేనని తెలిపారు.
అంచనాలు కరెక్ట్ అయితే..
తన అంచనాలు కరెక్ట్గా అయితే అండవ కానోమ్ చిత్రం ఈ ఏడాది జాతీయ అవార్డుల పట్టికలో చోటు సంపాదించుకుంటుందని అన్నారు. అంతేకాదు ఈ సినిమాను అజిత్ వివేగం సినిమా రిలీజ్ అవుతున్న ఆగస్టు 11నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రిస్కే అయినా.. తమ సినిమా విజయం పై చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నామని తెలిపారు.