Don't Miss!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
విడాకులు తరువాత మొదటిసారి ధనుష్ తో ఐశ్వర్య.. అందుకోసం తప్పలేదు.. ఫొటో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది మొదట్లో తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వార్తతో అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నా వారిద్దరు అంత హఠాత్తుగా ఎందుకు విడిపోయారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. అయితే ఈ క్రమంలో విడిపోయిన ఈ జంట మళ్ళీ కలిసిపోయారా అనే విధంగా ఒక ఫోటోకు స్టిల్ ఇచ్చిన విధానం వైరల్ గా మారుతొంది. ఇక వారు ఎందుకు హఠాత్తుగా కలుసుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..
వ్యక్తిగత నిర్ణయాలతో..
రజనీకాంత్ మొదటి కుమార్తె ఐశ్వర్య ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా యంగ్ ఏజ్ లోనే వీరిద్దరికీ వివాహం జరగడం అప్పట్లోనే మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎంతో అన్యోన్యంగా 18 ఏళ్ల పాటు కొనసాగిన వారి మ్యారేజ్ లైఫ్ కు ఇదే ఏడాది మొదట్లో ముగింపు కార్డు పడినట్లుగా తెలియజేశారు. అయితే ఇద్దరు కూడా వారి వ్యక్తిగత నిర్ణయాల మేరకు గౌరవమిచ్చే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు.
కలిస్తే బాగుంటుందని..
ఐశ్వర్య అలాగే రజినీకాంత్ ఇద్దరు కూడా అలా విడిపోవడం అభిమానులకు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలకు ఎవరికి కూడా అంతగా నచ్చలేదు. మళ్ళీ వారిద్దరూ కూడా కలిస్తే బాగుంటుంది అని కూడా చాలామంది సలహాలు ఇచ్చారు. అయితే రజినీకాంత్ తో పాటు గణేష్ తండ్రి కూడా ఆ విషయంపై చాలాసార్లు చర్చలు అయితే కొనసాగించారట. కానీ ఇద్దరు కూడా చాలా బలమైన నిర్ణయాలతోనే విడాకులు తీసుకోవడానికి డిసైడ్ ఆయినట్లు తెలియడంతో ఆ తర్వాత వారు కూడా సైలెంట్ అయిపోయినట్లు వార్తలు వచ్చాయి.
కొడుకులు ఇద్దరు
ధనుష్ ఐశ్వర్య ఇద్దరు మగ పిల్లలు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒకరు యాత్ర మరొకరు లింగ. వీరిద్దరూ కూడా తల్లిదండ్రులతో కలిసి ఉండే విధానం కూడా ఎంతో అన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్య తన కొడుకులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక విడిపోయిన తర్వాత పిల్లలు కొన్ని రోజులు తండ్రి దగ్గర మరి కొన్ని రోజులు తల్లిదగ్గర వారి లైఫ్ ను కొనసాగిస్తున్నారు.
తల్లిదండ్రులుగా..
ముఖ్యంగా ధనుష్ అయితే తన కొడుకులిద్దరినీ కూడా ప్రత్యేకంగా కొన్ని ఫిలిమ్ ఈవెంట్స్ తీసుకు వెళుతున్నాడు. ఆ మధ్యకాలంలో ఇళయరాజా మ్యూజికల్ ఈవెంట్ లో కూడా ధనుష్ తన కొడుకులు ఇద్దరితో కూడా ఫోటోలు దిగిన విధానం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఇక తర్వాత వెంటనే ఐశ్వర్య కూడా తన కొడుకులను కలుసుకోగానే ఎమోషనల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
విడాకుల తరువాత..
ఇక ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకున్న తర్వాత ఒక్కసారిగ కూడా ఎదురు పడలేదు కానీ మొదటిసారి వారి పిల్లల కోసమే కలవాల్సి వచ్చింది. పెద్ద కుమారుడు యాత్ర స్కూల్లో ఒక ఈవెంట్ జరగడం వలన తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పడంతో తల్లిదండ్రులుగా ధనుష్ ఐశ్వర్య వారి బాధ్యతను నిర్వహించారు.
ఇద్దరూ కూడా అక్కడ సంతోషంగా ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చారు. నా పెద్ద కుమారుడు ఒక స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు అంటూ ఐశ్వర్య కూడా తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేసుకకుంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వారు తొందరగా కలిసిపోతే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.