twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతారా అదేం పని?

    By Staff
    |

    Nayantara
    అదేంటో గాని నయనతార ఈ మధ్య మాటిమాటికీ వార్తలు కెక్కుతోంది. నయనతార పై బ్యాన్...అనంతరం ఎత్తివేత అనేది మర్చిపోక ముందే తనకు తానే ఓ గుడి కట్టించుకుందంటూ గుప్పుమంది. సర్వ సాధారణంగా సినీ నటులకు అభిమానులు గుడులు కట్టించి పూజలు చేస్తూంటారు..కానీ ఇలా గుడి కట్టుకుని పూజలు చేయమనరు. ఇంతకు ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, తమిళ, తెలుగు నటి ఖుష్బూకు అభిమానులు స్వయంగా ఆలయాలు నిర్మించి పూజలు చేశారు. మొన్నా మద్య భారీ అందాల సుందరి నమితకు కూడా గుడి కడతామంటూ ప్రపోజల్స్ వచ్చాయి. అయితే ఆమె ఒప్పుకోలేదు.

    ఇక హఠాత్తుగా నయనతారకేం పని వచ్చింది గుడి స్వంతంగా కట్టుకోవటానికీ అంటే..మరేమీ లేదుట...జోతిష్యం పై నమ్మకమే ఈ పనిచేయించిందని సమాచారం. వారు చెప్పిన దాని ప్రకారం ఆమె ఇక్కట్లు తప్పటానికి దిష్టి దోషం పోయి కెరీర్ సెటిల్ అవ్వటానికి ఈ పని చేసిందిట. జోతిష్య నిపుణుల సూచన మేరకు తమిళనాడులోని ఒక మారు మూల గ్రామంలో తన సొంత డబ్బుతో గుడి కట్టించి, దాన్ని అభిమానులు కట్టించినట్టుగా ప్రచారం చేస్తోందట.

    ఆమెకు దిష్టి దోషం ఉందని, దీన్ని పోగొట్టుకునేందుకే ఇలా చేయమని జోతిష్కులు చెప్పినట్టు చెన్నై సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇది చేసిన వెంటనే మిస్ అయిన ఛాన్స్‌లు తిరిగి రావటం, నిర్మాతల మండలి బహిష్కరణ తొలిగింపబడటం, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ వంటివారు సరసన ఆఫర్,బోయపాటి సినిమాలో ఆఫర్ వచ్చాయిని చెప్తున్నారు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఇలా సినీతారలు తమ తమ మూఢ నమ్మకాలతో ఇష్టమొచ్చినట్లు ముందుకెళ్తే వారిని గుడ్డిగా అనుకరించే అభిమానులు ఇబ్బందిపడతారని అంటున్నారు. ఇదీ ఆలోచించాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X