ఇదేం పద్దతి అజిత్?.. అసహనం వ్యక్తం చేసిన విశాల్!
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పోరాటాల కాలం నడుస్తోంది. కర్ణాటక, తమిళ నాడు మధ్య కావేరి జలాల వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి కావేరి జలాలని సాధించే నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ కూడా ప్రత్యక్ష పోరాటంలోకి దింగింది. మొన్నటి వరకు డిజిటల్ ప్రొవైడర్లతో తమిళ చిత్ర పరిశ్రమ పోరాడిన సంగతి తెలిసిందే. కావేరి వాటర్ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా రాముల చిత్ర పరిశ్రమ మౌన పోరాట దీక్షలు చేపట్టింది.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో తమిళ నిర్మాతల మండలి చైర్మన్ విశాల్ ఎప్పుడూ ముందు ఉంటాడు. కాగా విశాల్.. స్టార్ హీరో అజిత్ వైఖరి పట్ల అసహం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ చేస్తున్న మౌన పోరాట దీక్షకు అజిత్ హాజరు కాలేదు. దీనిపై విశాల్ స్పందించారు. అజిత్ ఎప్పుడూ అందుబాటులో ఉండదు. అజిత్ కలవడానికి ప్రయత్నించినా కుదర్లేదు అని విశాల్ తెలిపాడు.

అందరు తప్పనిసరిగా హాజరు కావాలని హుకుం జరీ చేయడానికి ఇదేమి స్కూల్ కాదని విశాల్ తెలిపారు. ఎవరికి వారు నైతికంగా బాధ్యత వహించి ముందుకు రావాలని విశాల్ పిలుపు ఇచ్చారు. కానీ ఇలాంటి వ్యవహారాలకు అజిత్ ఎప్పుడూ దూరంగా ఉంటాడు.


Click it and Unblock the Notifications











