Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
విజయ్ను చంపేశాడని అజిత్ అభిమానిని కత్తితో పొడిచాడు.. హీరోల తీరుపై విమర్శలు
ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలు విజయ్, అజిత్ అభిమానుల మధ్య అప్రకటిత యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న అజిత్ అభిమానులు విజయ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. దీనికి ప్రతిగా విజయ్ అభిమానులు కూడా రెస్పాండ్ అయ్యారు. దీంతో ఈ వివాదం ముగుస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ, అంతకు మించి పోయే రీతిలో ఓ సంఘటన జరిగింది.
విజయ్ చనిపోయాడంటూ..
విజయ్కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి కోసం పడి చచ్చిపోయే అభిమానులు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ, చరిత్రలో తొలిసారి ఆయనను విమర్శించే వాళ్లు బయటకు వచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. విజయ్ను వ్యతిరేకించే కొందరు ట్విట్టర్లో #RIPactorVIJAY అనే ట్యాగ్ క్రియేట్ చేసి వికృతానందం పొందుతున్నారు. ఈ యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
ఫ్యాన్స్ బతికించారు
అజిత్ అభిమానులు #RIPactorVIJAY ప్రచారానికి ప్రతీకారంగా విజయ్ అభిమానులు రంగంలోకి దిగారు. #LongLiveVIJAY విజయ్ అనే యాష్ ట్యాగ్ ట్రెండింగులోకి తేవడం ద్వారా తమ హీరోను బ్రతికించారు. దీంతో ఈ యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది.
ఇప్పుడు కత్తితో దాడి
పుళల్ సమీపంలోని కావంగరైలో శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివశిస్తున్న ఉమాశంకర్ (32), రోషన్ (34) ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఉమా శంకర్ అజిత్ అభిమాని కాగా, రోషన్ విజయ్ అభిమాని. హీరోల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రోషన్.. అజిత్ అభిమాని అయిన ఉమాశంకర్పై కత్తితో దాడి చేశాడు.
పరిస్థితి విషమం
తీవ్రంగా గాయపడిన ఉమాశంకర్ను స్థానికులు పాడియ నట్లూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడి వైద్యులు అతడికి ప్రధమ చికిత్స చేశారు. అయితే, తీవ్ర రక్తస్రావం అవడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
హీరోలు మాత్రం స్పందించడం లేదు
ఒకవైపు తమ అభిమానులు తిట్టుకుంటున్నా.. ఇప్పుడు కత్తులతో పొడుచుకుంటున్నా.. సదరు హీరోలు మాత్రం స్పందించడం లేదు. దీనిపై చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇంత యాగి చేస్తుంటే హీరోలు సైలెంట్గా ఉండడం ఏమాత్రం బాగోలేదని పలువురు విమర్శిస్తున్నారు.