Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రిలీజ్కు ముందే రికార్డు క్రియేట్ చేసిన ‘వాలిమై’: లాక్డౌన్ తర్వాత ఇదే మొదటి సినిమా
తమిళ సినీ పరిశ్రమలోని స్టార్ హీరోల్లో తలా అజిత్ కుమార్ ఒకడు. దాదాపు మూడు దశాబ్ధాలుగా కోలీవుడ్లో తన హవాను చూపిస్తోన్న అతడు.. దక్షిణాది మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో మార్కెట్ను కూడా ఏర్పరచుకున్నాడు. దీంతో అతడి సినిమాలకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్.. ప్రస్తుతం 'వాలిమై' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల కాకముందే.. తాజాగా ఈ మూవీ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది.
బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్గా రూపొందిన 'నెర్కొండ పార్వాయి'తో చాలా కాలం తర్వాత భారీ హిట్ను అందుకున్నాడు అజిత్ కుమార్. దీని తర్వాత అతడు నటిస్తున్న చిత్రం 'వాలిమై'. హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ చిత్రం తమిళనాడు హక్కులు తాజాగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీనిని గోపురం ఫిల్మ్ అనే సంస్థ రూ. 72 కోట్లకు కొనుగోలు చేసిందట. తమిళ సినీ చరిత్రలో ఇది మూడో అత్యధిక ధర కాగా.. లాక్డౌన్ తర్వాత మాత్రం తొలి సినిమా అనే టాక్ వినిపిస్తోంది.
గతంలో విజయ్ నటించిన 'సర్కార్', 'బిగిల్' చిత్రాలకు రూ. 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే, ఓవర్సీస్ హక్కులను యునైటెడ్ ఇండియా ఎక్స్పోర్ట్ సంస్థ రూ. 20 కోట్లకు కొనగోలు చేసిందట. అలాగే, తెలుగు రైట్స్ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ రూ. 10 కోట్లకు కొన్నారని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అజిత్ కుమార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యువ హీరో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు.