Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బ్యానర్లు, పోస్టర్లు వద్దని ఫ్యాన్స్ కు స్టార్ హీరో పిలుపు
ఈ విషయమై ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. ఆడంబరాన్ని నేనెప్పుడూ కోరుకోలేదు. ఇష్టపడను కూడా. అభిమానులు తమను తాము అభివృద్ధి పరుచుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలే తప్ప నాకోసం వృథా చేయడం సమంజసం కాదు. అందుకే అభిమానుల సంఘాన్ని రద్దు చేశాను.
రాబోయే పుట్టినరోజు నాడు నేను చెన్నైలో ఉండను. ఏఎం రత్నం నిర్మాణంలో విష్ణువర్ధన్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తుంటా. రాజస్థాన్లో షూటింగ్ ఉంటుంది. అక్కడ మా కుటుంబీకులతో సాదాసీదాగా జన్మదినాన్ని జరుపుకుంటా. కటౌట్లు, బ్యానర్లు వంటివాటికి అభిమానులు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని ఆ డబ్బులను పేద విద్యార్థుల చదువులకు, పేదల అవసరాలకు వినియోగించాలని కోరుకుంటున్నా. ఇలాంటివాటిని నా అసలైన పుట్టినరోజు కార్యక్రమాలుగా భావిస్తానని పేర్కొన్నారు అన్నారు.
అలాగే అజిత్ కొత్తచిత్రం పేరు ఖరారవలేదని దర్శకుడు విష్ణువర్ధన్ తెలిపాడు. 'బిల్లా' అనంతరం వారిద్దరి కలయికలో ఓ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అజిత్కు జంటగా నయనతార నటిస్తుండగా, ఆర్య-తాప్సీ మరో జంటగా కనిపించనున్నారు. ప్రారంభం నుంచి పేరుపై స్పష్టత రాలేదు. ఎన్నో పేర్లు పరిశీలించినా చిత్రబృందం సంతృప్తి చెందలేకపోయింది. ఈ నేపథ్యంలో 'వలై' అన్న పేరు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. వాటిని విష్ణువర్ధన్, అజిత్ ఖండించకపోవటంతో వాస్తవమేననుకున్నారు. సినిమా టైటిల్ 'వలై' కాదంటూ విష్ణువర్ధన్ తాజాగా వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించలేదని, కొన్నింటిని పరిశీలిస్తున్నామన్నారు. వచ్చేనెల 10న ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.