Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
బ్యానర్లు, పోస్టర్లు వద్దని ఫ్యాన్స్ కు స్టార్ హీరో పిలుపు
ఈ విషయమై ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. ఆడంబరాన్ని నేనెప్పుడూ కోరుకోలేదు. ఇష్టపడను కూడా. అభిమానులు తమను తాము అభివృద్ధి పరుచుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలే తప్ప నాకోసం వృథా చేయడం సమంజసం కాదు. అందుకే అభిమానుల సంఘాన్ని రద్దు చేశాను.
రాబోయే పుట్టినరోజు నాడు నేను చెన్నైలో ఉండను. ఏఎం రత్నం నిర్మాణంలో విష్ణువర్ధన్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తుంటా. రాజస్థాన్లో షూటింగ్ ఉంటుంది. అక్కడ మా కుటుంబీకులతో సాదాసీదాగా జన్మదినాన్ని జరుపుకుంటా. కటౌట్లు, బ్యానర్లు వంటివాటికి అభిమానులు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని ఆ డబ్బులను పేద విద్యార్థుల చదువులకు, పేదల అవసరాలకు వినియోగించాలని కోరుకుంటున్నా. ఇలాంటివాటిని నా అసలైన పుట్టినరోజు కార్యక్రమాలుగా భావిస్తానని పేర్కొన్నారు అన్నారు.
అలాగే అజిత్ కొత్తచిత్రం పేరు ఖరారవలేదని దర్శకుడు విష్ణువర్ధన్ తెలిపాడు. 'బిల్లా' అనంతరం వారిద్దరి కలయికలో ఓ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అజిత్కు జంటగా నయనతార నటిస్తుండగా, ఆర్య-తాప్సీ మరో జంటగా కనిపించనున్నారు. ప్రారంభం నుంచి పేరుపై స్పష్టత రాలేదు. ఎన్నో పేర్లు పరిశీలించినా చిత్రబృందం సంతృప్తి చెందలేకపోయింది. ఈ నేపథ్యంలో 'వలై' అన్న పేరు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. వాటిని విష్ణువర్ధన్, అజిత్ ఖండించకపోవటంతో వాస్తవమేననుకున్నారు. సినిమా టైటిల్ 'వలై' కాదంటూ విష్ణువర్ధన్ తాజాగా వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించలేదని, కొన్నింటిని పరిశీలిస్తున్నామన్నారు. వచ్చేనెల 10న ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.