Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
అప్పు తీర్చాకే రిలీజ్ అని పెద్ద నిర్మాతకు...కోర్టు
చెన్నై : పెద్ద సినిమాలు ఏ నిముషంకి ఏ ఇబ్బంది వస్తుందో ఎవరికీ తెలియదు. తాజాగా ఏఎం రత్నం నిర్మాణంలో 'తల' అజిత్ నటించిన కొత్త చిత్రం 'ఆరంభం'. విష్ణువర్దన్ దర్శకత్వం వహించారు. నయనతార కథానాయిక. 'బిల్లా' తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాను దీపావళి కానుకగా, అంతకన్నా కొన్ని రోజుల ముందే సినిమాను విడుదల చేయాలని నిర్మాణ వర్గాలు భావించాయి. ప్రస్తుతం కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి.
ఏఎం రత్నం తనకు ఇవ్వాల్సిన రుణాన్ని ఇచ్చిన తర్వాత సినిమాను విడుదల చేయాలని హైకోర్టులో షెనాయ్నగర్కు చెందిన రాజేశ్వరి ఓ పిటిషన్ దాఖలు చేశారు. 2005లో 'కేడీ' సినిమా నిర్మాణం కోసం రూ.1.5 కోట్లు తీసుకున్నారని, ఆ నగదు తిరిగిచ్చాక సినిమాను విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. రెండువారాల్లో సమాధానం ఇవ్వాలని ఏఎం రతానికి నోటీసులు జారీ అయ్యాయి. విచారణ 25వ తేదీకి వాయిదా వేశారు.
కథ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఇంకా చాలా పనులున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించింది. ప్రతి ఫ్రేమూ ఎంతో కష్టపడి చిత్రీకరించాం. కేవలం అజిత్ అభిమానులకే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పగలను. అజిత్కు తగ్గట్టు పలు పంచ్ డైలాగులున్నాయి. 'తుప్పాక్కి వైతిరుక్కురవన్ పేసమాట్టాన్'.. (తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు) వంటి సంభాషణలు థియేటర్లో పేలడం ఖాయం. అజిత్, ఆర్య కలయిక అనుకున్నట్టే క్లిక్ అయింది. ఇక ప్రేక్షకుల ముందు తెరపై పండటమే మిగిలి ఉంది. ఆ విషయాన్ని త్వరలో మీరే చూస్తారుగా అని ముగించారు.