Don't Miss!
- News జనంలోనే జగన్: నియోజకవర్గాల్లో సభలు.. అక్కడే బస
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
అజిత్ సత్తా అంటే అదే.. కేవలం 2 గంటల్లో 4 లక్షలు లైక్స్
బాలీవుడ్లో సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసల పొందిన చిత్రం పింక్. ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రం నేర్కొండ పార్వాయి అనే పేరుతో రూపొందుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ బుధవారం (జూన్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్, జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ నటించారు. ఈ కీలక పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారు.. హిందీలో ఈ పాత్రలను అమితాబ్, తాప్సీ పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తుండగా, హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.
కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో లాయర్ పాత్రలో అజిత్ ఇరుగదీసినట్టు ట్రైలర్లో కనిపించింది. అజిత్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన రావడంతో ఈ టీజర్ రికార్డు స్థాయి లైక్స్ను సాధించింది. కేవలం 2 గంటల్లోనే ఈ ట్రైలర్ 4 లక్షల లైక్స్ను సాధించడంతో అజిత్ సత్తా తెలిసింది.
శ్రీదేవితో ఉన్న అనుబంధం కారణంగానే ఈ చిత్రంలో అజిత్ నటించినట్టు మీడియా రిపోర్ట్. ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తూ.. కోలీవుడ్లోకి ప్రవేశిస్తున్నాడు. నేర్కొండ పార్వాయి చిత్రం తర్వాత దర్శకుడు హెచ్ వినోద్, బోని కాంబినేషన్ రిపీట్ కానున్నది. అజిత్ కెరీర్లో 60వ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.