Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
హీరో అజిత్ పెద్ద మనసు: విశ్వాసంతో రూ. 50 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి...
Recommended Video
అజిత్ హీరోగా వచ్చిన 'వివేకం' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. దీంతో చిత్ర నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. తమిళనాడులో పెద్ద స్టార్ హోదాలో ఉన్న ఆయన ఆ నష్టాన్ని పూడ్చడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని నిర్మాత కె రాజన్ స్వయంగా వెల్లడించారు.
రూ. 50 కోట్ల నష్టం
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కె రాజన్ మాట్లాడుతూ...‘వివేకం' సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దీని వల్ల రూ. 50 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాలను పూడ్చడానికే అజిత్ ‘విశ్వాసం' సినిమా చేస్తున్నారు అని తెలిపారు.
దర్శకుల అసమర్ధత వల్లే
ఈ సందర్భంగా కె రాజన్ దర్శకుల తీరుపై మండి పడ్డారు. దర్శకులు తాము ముందుగా చెప్పిన డేట్స్, ఫిక్డ్స్ బడ్జెట్లో సినిమాను పూర్తిచేయడంలో విఫలం అవుతున్నారని, దీని వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయని తెలిపారు.
సీరియస్గా చెప్పారు
సిరుతై శివ దర్శకత్వంలో వచ్చిన వివేకం సినిమా నష్టాలు పాలు కావడం వల్లనే అతడి దర్శకత్వంలో మరో సినిమా ‘విశ్వాసం' సినిమా చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు పూడ్చాలని అజిత్ ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సినిమాను అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయాలని అజిత్ దర్శకుడికి సీరియస్గా చెప్పారన్నారు.
స్ట్రైక్ కారణంగా ఆలస్యం
విశ్వాసం సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా... కోలీవుడ్లో జరుగుతున్న స్ట్రైక్ కారణంగా ఇంకా మొదలు కాలేదు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి దిపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్.