twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పంజా'దర్శకుడు తదుపరి చిత్రం ఖరారు

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రం రూపొందించిన విష్ణు వర్ధన్ తదుపరి చిత్రం దాదాపు ఖరారు అయినట్లే. అయితే ఆయన తన తిరిగి తమిళంలోనే ఆ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రంలో అజిత్ హీరోగా చేయనున్నారు. గతంలో అజిత్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో బిల్లా చిత్రం వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. దాంతో వీరి కాంబినేషన్ పై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అజిత్ బిల్లా- 2 చేస్తున్నారు. నిజానికి బిల్లా చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్దన్‌నే బిల్లా -2 కు పని చేయాల్సింది. ఆయన తెలుగు చిత్రం పంజాను ఒప్పుకోవడంతో బిల్లా- 2కు చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    అజిత్,విష్ణువర్దన్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బిల్లా తర్వాత అజిత్‌తో మరో చిత్రం చేయనున్నానని తెలిపారు. తమ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయన్న విషయం తెలుసన్నారు. ప్రస్తుతం బిల్లా -2లో నటిస్తున్న అజిత్ మరోసారి దాదాగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ తో చేసిన పంజా గురించి విష్ణు వర్దన్ మాట్లాడుతూ..''పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేస్తానని... ఆ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో ఎస్‌.జె.సూర్యకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన వల్లే అవకాశం దక్కింది'' అన్నారు విష్ణువర్థన్‌.

    English summary
    Ajith will yet again team up with his good friend and stylish director Vishnuvardhan for his 52nd film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X