Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రజనీ మెచ్చుకున్నారు...గాల్లో తేలినట్లుంది
చెన్నై : రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ తమని మెచ్చుకుంటే బాగుంటుందని అందరికి అనిపిస్తుంది. అయితే అటువంటి సందర్బాలు అరుదుగా సంభవిస్తాయి. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కు ఆయన అభినందనలు దొరికాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా...'రోబో' సీక్వెల్ '2.0' చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్షయ్కుమార్ నటనను సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకున్నారు.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీ హీరోగా, అక్షయ్కుమార్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ప్రస్తుతం దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. ఇటీవల అక్షయ్పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు.
సోమవారం రజనీకాంత్ కూడా షూటింగ్లో పాలుపంచుకున్నారు. తొలిసారిగా ఇద్దరూ కలిసిన నేపథ్యంలో సెట్లో సందడి నెలకొంది. ఆ రోజు షూటింగ్ ముగిశాక అక్షయ్ నటనను రజనీ మెచ్చుకున్నారట. చాలా బాగా చేస్తున్నారని అభినందించారని సమాచారం. దాంతో అక్షయ్ చాలా సంతోషంగా తన మిత్రులకు,సన్నిహితులకు ఈ విషయం చెప్పాడని బాలీవుడ్ మీడియా చెప్తోంది.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.."నేను కలలో కూడా ఇలాంటివి ఊహించలేదు.ఆయన అద్బుతమైన నటుడు..అంతేకాదు గొప్ప మానవతా వాది కూడాను. ఆయనతో కలిసి నటించటం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. యాక్షన్, గ్రాఫిక్స్, ఆయన పంచ్ లు ఇవన్ని నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి ." అన్నారు.