twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెన్నై పోర్టులో అల్లు అర్జున్‌ గొడవ

    By Srikanya
    |

    అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నై పోర్ట్ లో జరుగుతోంది. అక్కడ అల్లు అర్జున్ గొడవపడి ఫైట్ చేసే యాక్షన్‌ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. వీటికి పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తున్నారు.

    అక్కడ కలిసిన మీడియాతో ... తమ చిత్రం పోగ్రస్ గురించి నిర్మాత మాట్లాడుతూ.. 'బద్రినాథ్‌'లో పూర్తిస్థాయి యాక్షన్‌ హంగామా చూపించారు అల్లు అర్జున్‌. ఈసారి వినోదం బాట పట్టారు. బన్నీని కొత్త కోణంలో చూపించే కథ ఇది. త్రివిక్రమ్‌ శైలిలోనే సరదాగా సాగిపోతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ మేళవించాం. సంభాషణలు ఆకట్టుకొంటాయి. పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ ఘట్టాలను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. అవన్నీ మాస్‌ని అలరిస్తాయి. రాజేంద్రప్రసాద్‌ పాత్ర కీలకం. త్వరలో చిత్రం పేరుని అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు.

    ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: డి.వి.వి.దానయ్య.

    English summary
    Allu Arjun's upcoming film in the direction of Trivikram Srinivas is having its shoot with a brisk pace at Chennai Port.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X