అల్లు అర్జున్, శింబు జడ్జిలుగా...

By Srikanya

అల్లు అర్జున్,శింబు న్యాయ నిర్ణేతలుగా పాల్గొనే పోటీ ఒకటి జరగనుంది. ప్రముఖ శీతలపానియాల సంస్ద 7 అప్‌ తాజాగా '7 అప్‌ పటాలం' పేరిట ఈ పోటీలను నిర్వహించనుంది. దీని నిమిత్తం వీరిద్దరూ జడ్జిలుగా ఉంటారు. ఇందు నిమిత్తం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తనతో కలసి డాన్స్‌ చేసే అవకాశం కొరకు హైదరాబాద్‌, బెంగుళూరు, తమిళనాడులో పోటీలు నిర్వహిస్తున్న నటుడు శింబు కోరారు. ఇందుకోసం 7 సభ్యులు వుండే టీమ్‌ ఎంపిక కోసం ఆయా రాష్ట్రాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో ఫైనల్స్‌ చేరిన జట్లకు నిర్వహించే పోటీలలో 7 అప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌లు శింబు, అల్లు అర్జున్‌లు న్యాయనిర్ణేతలుగా పాల్గొంటారు.

విజేతకు శింబుతో కలసి డాన్స్‌ చేసే అవకాశంతో పాటు 51 లక్షల బహుమతులను అందుకోనున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. జులాయి టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక గతంలో అల్లు అర్జున్ చేసిన వేదంలో పాత్రను తమిళంలో శింబు చేసారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఈ రకంగా జడ్జిలుగా పాల్గొనటం ఇద్దరు అభిమానలుకు ఆనందాన్ని కలగచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X