ఎస్జె సూర్య హీరోగా సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!
దర్శకుడు, నటుడు అయిన ఎస్ జె సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఎస్ జె సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఉయర్నద మణిదన్'. ఈ చిత్రానికి తమిళ్ వాననే దర్శత్వం వహించనున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే ఎస్ జె సూర్య ఈ చిత్రంలోని పాత్రకు అమితాబ్ ని కలసి ఒప్పించారు.
ఈ చిత్రం కోసం అమితాబ్ దాదాపు 40 రోజుల కాల్ షీట్స్ కేటాయించబోతున్నారు అంటే అది ఎంత ప్రాధాన్యత కలిగిన పాత్రో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సౌత్ దర్శకులంతా అమితాబ్ క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అమితాబ్ ప్రస్తుతం సౌత్ చిత్రాలవైపు చూస్తున్నారు. లేటు వయసులో తన నటనలో సత్తాని సౌత్ ఆడియన్స్ కు చూపించాలని అమితాబ్ భావిస్తున్నారు. అందుకే ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే ఒకే చెప్పాలని అమితాబ్ భావిస్తున్నారు. ఎస్ జె సూర్య ఇటీవల పలు చిత్రాల్లో చేసిన విలన్ పాత్రలకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరోగా మారి కొన్ని చిత్రాలు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











