వన్స్ మోర్ 'నీలాంబరి'

ఈ సీరియల్ లో ఆమె డబుల్ రోల్ లో కనిపించనుంది. అందులో ఒకటి 'నరసింహ' సినిమాలో ని నీలాంబరి పాత్ర, మరొకటి మిడిల్ క్లాస్ అమ్మాయి గా కనిపిస్తుంది. సీరియల్ రంగంలో పేరొందిన కుట్టిపద్మిని ఈ సీరియల్ కి కథా రచన చేసారు. స్క్రీన్ ప్లే దేవీబాల, డైలాగులు జగన్ మోహన్ అందిస్తున్నారు. అలాగే యమ్.ఆర్.సెంధిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇక కుట్టిపద్మిని కూతురు కీర్తన, రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్ తో కలిసి ఈ సీరియల్ నిర్మిస్తోంది. అలాగే రమ్యకృష్ణ ఎపిసోడ్ కి రెండు లక్షలు చొప్పున తీసుకుంటోంది. త్వరలోనే ఈ సీరియల్ తెలుగులోనూ డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











