Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ చెల్లెలుగా నటించటానకి కమిటైన అనుష్క
ఖలేజా చిత్రంలో మహేష్ వెంటబడే అమ్మాయిగా నటించిన అనుష్క త్వరలో అతని చెల్లిగా కనిపించనున్నదని సమాచారం. మణిరత్నం నిర్మిచనున్న చిత్రం కోసం వీరిద్దరూ అన్నా..చెల్లెలు అవతారమెత్తుతున్నారు. పొన్నియన్ సెల్వెన్ అనే నవల ఆధారంగా మణిరత్నం తమిళ,తెలుగు భాషల్లో నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ సరసన అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్ కు బావ పాత్ర చేస్తున్నారు మహేష్. మహేష్ ఈ చిత్రంలో ఓ రాజుగా కనిపించనున్నారు.మహేష్ సరసన ఏ హీరోయిన్ నీ ఇంకా ఎంపక చేయలేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని మహేష్ కోసం వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు ..శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.