Don't Miss!
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Technology ఆపిల్ నుంచి త్వరలో ఏయే ఉత్పత్తులు లాంచ్ కానున్నాయో తెలుసా.. ఫోల్డబుల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు సహా..!!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- News ఎన్నికల వేళ సీఎం జగన్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఆ సూపర్ హిట్ సీక్వెల్ సినిమా కమిటైన అనుష్క
అరుంధతి విజయంతో వెనక్కి తిరిగిచూసుకోలనటువంటి క్రేజు తెచ్చుకున్న అనూష్క తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్ 'బిల్లా-2"లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రశాంత్ తో చేసిన 'రెండు" చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఆమెకు అప్పట్లో ఐడెంటెటీ రాలేదు. ఆ తర్వాత విజయ్ 'వేట్టైక్కారన్"తో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తమిళంలోనూ బిజీ స్టార్ గా మారింది. ఇక సూర్యతో చేసిన 'సింగం" (యముడు) ఘన విజయం సాధించటంతో అక్కడా బిజీ హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం తెలుగు 'వేదం" రీమేక్ అయిన 'వానం"లో ఆమె వేశ్యగా నటిస్తోంది. అలాగే విక్రమ్ సరసన 'దైవమగన్" చిత్రంలో నటిస్తున్న అనుష్కను తీసుకున్నారు. ప్రస్తుతం తమిళ 'బిల్లా"కు సీక్వెల్గా విష్ణువర్థన్ 'బిల్లా-2" తెర కెక్కించే సన్నాహంలో ఉన్నారు. అజిత్ 50వ చిత్రమైన 'మంగాత్తా" తర్వాత 'బిల్లా-2" సెట్స్పైకి వెళ్లనుంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో నాగార్జున 'ఢమరుకం", ప్రభాస్ 'రెబల్" చిత్రాలను అంగీకరించింది.