Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బంపర్ ఆఫర్ కొట్టేసిన అనుష్క.. చారిత్రాత్మక చిత్రంలో!
Recommended Video
అందాల తార అనుష్క వెండితెరపై మెరిసి ఏడాది గడిచిపోతోంది. బాహుబలి 2తో సంచలనం, భాగమతి సూపర్ హిట్ తర్వాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. భాగమతి చిత్రం తర్వాత అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. త్వరలో వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ రూమర్లని పట్టించుకోకుండా అనుష్క తన లుక్ పై దృష్టిపెట్టింది. విదేశాలకు వెళ్లి బరువు తగ్గి స్లిమ్ గా మారింది. ప్రస్తుతం అనుష్క సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ చరిత్రాత్మక చిత్రంలో అనుష్కకు అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.
డ్రీమ్ ప్రాజెక్ట్
దిగ్గజ దర్శకుడు మణిరత్నం గత ఏడాది తెరకెక్కించిన చెక్కా చివంత వానమ్ చిత్రంతో చాలా కాలం తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నారు. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మణిరత్నం ప్రస్తుతం ఓ చారిత్రాత్మక చిత్రానికి సిద్ధం అవుతున్నారు. చోళుల చరిత్రపై వచ్చిన పొన్నియన్ సెల్వన్ నవల ఎంత ప్రసిద్ధి గాంచిందో అందరికి తెలిసిందే. ఆ నవల ఆధారంగా మణిరత్నం భారీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. పొన్నియన్ సెల్వన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మణిరత్నం పలు సందర్భాల్లో తెలిపారు.
నో చెప్పిన నయనతార
పొన్నియన్ సెల్వన్ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం లేడీ సూపర్ స్టార్ నయనతారని ఎంపిక చేసుకున్నారు. కానీ నయన్ ఈ చిత్రం నుంచి తప్పకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార స్టార్ హీరో విజయ్ చిత్రంలో, రజనీకాంత్ దర్బార్ చిత్రంలో, మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. దీనితో పొన్నియన్ సెల్వన్ కి డేట్స్ సర్దుబాటు కాలేదట. దీనితో ఈ చిత్రం చేయలేనని మణిరత్నంతో చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అనుష్కే కావాలి
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో అందుకు తగ్గ నటీనటులనే ఎంచుకోవాలని మణిరత్నం భావిస్తున్నాడు. నయన్ తప్పుకోవడంతో మరో స్టార్ హీరోయిన్ అనుష్కతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుష్క పూంగుళిలి అనే మహారాణి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాహుబలిలో దేవసేనగా, రుద్రమదేవిలో టైటిల్ రోల్ లో మహారాణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అందరూ స్టార్లే
ఈ చిత్రంలో జయం రవి టైటిల్ రోల్ పొన్నియన్ సెల్వన్ గా నటించబోతున్నాడు. కార్తీ, విక్రమ్ కూడా హీరోలుగా నటించబోతున్నారు. సత్యరాజ్, మోహన్ బాబు, అమితాబ్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ యువరాణి పాత్రలో నటించనుంది. మాజీ ప్రపంచ సుందరి ఐష్వర్యరాయ్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటిస్తుందట. ఇలాంటి విశేషాలన్నీ పొన్నియన్ సెల్వన్ పై అంచనాలు పెంచేస్తున్నాయి.