Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముంబైలో రజనీ దర్బార్.. ఓటు హక్కు కోసం తలైవా ఏం చేశారంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్దిరోజులుగా ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించుకొనేందుకు ఈ షూటింగ్ కాస్త విరామం ఇచ్చి చెన్నైకి వెళ్లారు. ఓటు హక్కు ఉపయోగించుకొన్న తర్వాత మళ్లీ ముంబైకి ప్రయాణమై షూటింగ్లో బిజీగా మారారు.
ఇక దర్బార్ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తొలిభాగంలో రజనీ సామాజిక కార్యకర్తగా, సెకండాఫ్లో ఐపీఎస్ అధికారిగా కనిపిస్తారని చెన్నై సినీవర్గాల టాక్.
దర్భార్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఏఆర్ మురగదాస్ ప్రత్యేకంగా సెట్ను వేశారు. కథలో భాగంగా ముంబైలో జరిగే సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
దర్భార్ చిత్రంలో రజనీకాంత్తోపాటు నయనతార, యోగిబాబు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తదితరుల నటిస్తున్నారు. రజనీ కెరీర్లో 167వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020 పొంగల్కు ప్రేక్షకుల ముందుకు రానున్నది.