Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డైరెక్టర్ బాలా, హీరో ఆర్యపై అరెస్ట్ వారెంట్ జారీ
తమిళ దర్శకుడు బాలా, హీరో ఆర్యపై అరెస్ట వారెంట్ జారీ అయింది. బాల దర్శకత్వంలో 2011లో వచ్చిన 'వాడు-వీడు' సినిమాకు సంబంధించిన కేసులో కోర్టు ముందు హాజరు కావాలని పలు సార్లు నోటీసులు జారీ చేసినా రాక పోవడంతో తమిళనాడులోని తిరునెల్వెలి కోర్టు ఈ ఇద్దరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
బాలా దర్శకత్వంలో తమిళ కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'అవన్-ఇవన్' (వాడు-వీడు)లో విశాల్, ఆర్య, జనని ఐయ్యర్, మధు శాలిని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సింగంపట్టి జమిందార్ను కించ పరిచినట్లు చూపించారంటూ శంకర్ ఆత్మజన్ అంబానీ అప్పట్లో కేసు వేశారు.
చాలా కాలం తర్వాత ఈ కేసు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గత కొన్నేళ్లుగా విచారణ సాగుతున్నా, ఎన్నిసార్లు సమన్లు అందినా వారు రాక పోవడంతో ఈ సారి కోర్టు వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి దీనిపై బాలా, ఆర్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
'అవన్-ఇవన్' తెలుగులో వాడు-వీడు పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో విశాల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై కాల్పతి ఎస్. అగోరమ్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం, ఆర్తూర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు.