Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఖచ్చి తంగా నయనతారే, తేల్చి చెప్పిన హీరో
రీసెంట్ గా మీడియావారు ప్రేక్షకుల మాట సరే.. మీ దృష్టిలో మీకు తగిన జోడీ ఎవరని ఆర్యని అడిగారు.
ఆర్య మాట్లాడుతూ.... ''నాతో నటించిన అందురూ నాకు సరిజోడీయే. వారందరిలోనూ ఎవరంటే మాత్రం కచ్చితంగా నయనతారే. అలా నేను కూడా ప్రేక్షకుల మాటతోనే ఏకీభవిస్తున్నాను''అని చెప్పాడు. సినిమాల గురించి మాట్లాడుతూ తన కెరీర్లో ఉత్తమ చిత్రంగా 'నాన్ కడవుల్' ఇప్పటివరకు ఉండేదని, త్వరలో విడుదల కానున్న 'ఇరండాం ఉళగం' కూడా ఆ జాబితాలో చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
అలాగే నయనతారను నేను ప్రేమిస్తున్నానా.. అబ్బే అలాంటిదేం లేదండీ.. నా పెళ్లి చేయడానికి మావాళ్లు అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని పేర్కొంటున్నాడు హీరో ఆర్య. స్టార్ హీరోగానే కాకుండా మహిళాభిమానులను పెద్ద సంఖ్యలో సంపాదించుకున్న నటుడు ఆర్య. నయనతార,ఆర్య తాజాగా 'రాజారాణి'లో నటించటం, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందనే వార్తలతో వీరి ప్రేమ వ్యవహారంపై వార్తలు మరోసారి జోరుగా వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదంటున్నాడు ఆర్య
ఆర్య మాట్లాడుతూ... '' కొన్ని నెలలుగా మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు 'రాజారాణి' చిత్రంలోని శుభలేఖతో మరింత వూపందుకున్నాయి. నయనతార నా సహనటి మాత్రమే. అంతకుమించి మా మధ్య మరో బంధమేదీ లేదు. ప్రస్తుతం మావాళ్లు నాకు వివాహం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అమ్మాయిని వెతుకుతున్నారు. వారు ఎంపిక చేసిన యువతి నాకూ నచ్చితే చేసుకుంటాను. ప్రేమ విషయానికొస్తే విద్యార్థి దశలో ఓ అమ్మాయిని ఆరేళ్లపాటు ప్రేమించా. ఆమెకు దూరమై సినిమాల్లోకి వచ్చాక ఇక ప్రేమ విషయం పూర్తిగా మర్చిపోయా. ప్రస్తుతం నా దృష్టిని కెరీర్పైనే కేంద్రీకరించా అన్నారు.
ఇక అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఆరంభం'. అత్యంతభారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇటీవల అక్కడ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం హక్కులు కొని 'ఆట ఆరంభం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డా.శీనుబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుక్ను ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అజిత్, ఆర్య నటన, నయనతార, తాప్సీ గ్లామర్, విష్ణువర్థన్ టేకింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. ఈ నెల మూడో వారంలో ఆడియోను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.