Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'ఆవారా' గాడు వందరోజులు పూర్తిచేసుకున్నాడు...!
కార్తి, తమన్నా జంటగా తమిళంలో రూపోందిన పయ్యా చిత్రాన్ని తెలుగులో 'ఆవారా' పేరుతో విడుదల చేశారు నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా . ఎన్.లింగుస్వానమి దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా నేటితో వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సంధర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సంస్ధ లో 'కార్తీ' హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' 100 రోజులు ప్రదర్శింపబడుతుంది.
ఇప్పుడు 'ఆవారా' కూడా అన్ని ముఖ్య పట్టణాల్లో వందరోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా వుంది. ఒకే సంవత్సరంలో 'కార్తీ' హీరోగా నటించిన రెండు సినిమాలు శతదినోత్సవాలను పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సంవత్సరంలోనే కార్తీ హీరోగా నటించిన మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాం అని అన్నారు.
నైజాంలో ఎస్ వీ ఆర్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసిన 'శోభారాణి' మాట్లాడుతూ ఆవారా సినిమాకి నైజాంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. మాస్ కేంద్రాల్లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇంత మంచి హిట్ చిత్రాన్ని మాకు అందించిన ఆవారా యూనిట్ కు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.